Skip to main content

Posts

Showing posts from July, 2025
 ఆధ్యాత్మిక ప్రసంగాలతో దేశ ప్రజలను మేల్కోల్పిన వైతాళికులు.. హైందవ ధర్మ ఔన్నత్వాన్ని ప్రపంచ శిఖరాగ్రాన నిలిపిన ధార్మిక చైతన్యులు.. దేహం నిండా దేశభక్తినీ నింపుకొని, కర్మాచరణమే ధర్మాచరణం అని నిమ్మి, దేశప్రజల్లో చైతన్యాన్ని నింపిన కాషాయ కేసరీ.. తన వాగ్దాటితో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్న చైతన్య ఝరీ స్వామి వివేకానందుని వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులు.
 అటాకర్స్ కట్టడికి గూగుల్ క్రోమ్ కొత్త అప్డేట్! క్రోమ్లో ఓ భద్రతా వైఫల్యాన్ని గుర్తించినట్లు గూగుల్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. యూజర్ రిమోట్ అటాకర్ క్రియేట్ చేసిన మాలిషస్ HTML పేజ్నీ విజిట్ చేస్తే అటాకర్స్ ఆ కంప్యూటర్పై కంట్రోల్ పొందే ఆస్కారం ఉంటుంది. దానిని అధిగమించేందుకు గూగుల్ కొత్త అప్డేట్ తెస్తున్నట్లు పేర్కొంది. కొన్నిరోజులు లేదా కొన్నివారాల్లో ఈ సెక్యూరిటీ అప్డేట్ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
 30 రోజులు షుగర్ మానేస్తే.. ఎ మవుతుంది.. షుగర్ లేకుండా రోజు గడవని పరిస్థితికి వచ్చేశాం. టీ, బిస్కెట్స్, కేక్స్ ఇలా ఏదో ఒక రకంగా చక్కెర మన శరీరంలోకి వెళ్తూనే ఉంటుంది. ఈ షుగరు 30 రోజులపాటు మానేస్తే ఎన్నో జబ్బులను దూరం చేయొచ్చని వెల్నెస్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లివర్ ఫ్యాట్ తగ్గడం, కిడ్నీ పనితీరు మెరుగవడం, హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గడం, ఆలోచనల్లో స్పష్టత, ఫోకస్ పెరగడం, రోగనిరోధక శక్తి స్ట్రాంగ్ అవడం వంటి లాభాలున్నాయని చెబుతున్నారు.
 Maharashtra : 3 నెలల్లో 767 మంది రైతుల ఆత్మహత్య మహారాష్ట్రలో వందలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి మకరంద్ జాధవ్ శాసన మండలిలో వెల్లడించారు. ఇది రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభానికి అద్దం పడుతోందంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఫైరవుతున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందంటూ దుయ్యబడుతున్నారు.
 నేడు కాంగ్రెస్ ‘సామాజిక న్యాయ సమర భేరి’ TG: ‘సామాజిక న్యాయ సమర భేరి' పేరిట కాంగ్రెస్ పార్టీ ఇవాళ సాయంత్రం HYD LB స్టేడియంలో సభనిర్వహించనుంది. సభకు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన సిటీకి చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు, ఇతర నేతలు సభలో పాల్గొననున్నారు. అంతకంటే ముందు ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీలతో ఖర్గే సమావేశం కానున్నారు.
 ట్రంప్ బిల్లుపై IMF హెచ్చరిక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్' ఆ దేశ కాంగ్రెస్ సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ బిల్లు అమల్లోకొస్తే రాబోయే పదేళ్లలో USపై $4 ట్రిలియన్ల భారం పడుతుందని IMF అధికార ప్రతినిధి జూలీ కొజాక్ హెచ్చరించారు. ఇప్పటికే ఆ దేశ అప్పులు GDPలో 98 శాతానికి చేరుతున్నాయని గుర్తుచేశారు.
 9న దేశవ్యాప్త సమ్మె ఈనెల 9న దేశంలో 2 రకాల సమ్మెలకు కార్మికులు సిద్ధమవుతున్నారు. యూపీలో విద్యుత్ డిస్కంలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది నిరసనలో పాల్గొననున్నారు. మరోవైపు అదేరోజు తాము కూడా సమ్మె చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం ప్రకటించింది. 4 లేబర్ కోడ్ల రద్దు, ఉపాధి హామీకి రూ.రెండున్నర లక్షల కోట్ల నిధుల కేటాయింపు, పట్టణాల్లోనూ ఉపాధిహామీ పథకం అమలు చేయాలనే డిమాండ్లతో దీన్ని చేపట్టనున్నట్లు తెలిపింది.
 పింగళి వెంకయ్య వర్ధంతి.. సీఎం నివాళులు AP: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. 'దేశ ఆత్మగౌరవ ప్రతీక అయిన జాతీయ పతాక రూపకర్త, గొప్ప దేశభక్తుడు, రచయిత పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆయన నిస్వార్థ దేశ సేవను స్మరించుకుందాం' అని CM ట్వీట్ చేశారు. 'పింగళి వెంకయ్య తెలుగువారవ్వడం మనకు గర్వకారణం. భారత జాతికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం' అని లోకేశ్ ట్వీట్ చేశారు.
 KCR ఆరోగ్యంపై BRS కీలక ప్రకటన TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత KCR అనారోగ్యంతో బాధపడుతున్నారని వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. 'రెగ్యులర్గా జరిగే పరీక్షల కోసమే కేసీఆర్ యశోద దవాఖానకు వచ్చారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించి, ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్పింది. వైద్య పరీక్షల కోసం మరో 2-3 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు ఆయనకు సూచించారు' అని వెల్లడించింది.
  భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి ,తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి  ఘన నివాళులు తెలిపిన ఆధార్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు "కుక్కల నాగేశ్వరరావు గౌడ్ గారు" మరియు ఖమ్మం జిల్లా ఆధార్ పార్టీ నాయకులు "నక్క  అజయ్ కుమార్ గారు 'తదితర నాయకులు నివాళులు తెలిపారు. ఆధార్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు  కుక్కల నాగేశ్వరరావు గౌడ్ గారు ఆధార్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు  నక్క అజయ్ కుమార్ గారు                
  కరోనా టీకాతో గుండెపోటు రాదు: AIIMS ఆకస్మిక గుండెపోటు మరణాలు ప్రజలను భయపెడుతున్న తరుణంలో AIIMS ప్రెస్మెట్ నిర్వహించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. గుండెపోటు మరణాలకు కరోనా టీకాకు ఎలాంటి సంబంధంలేదని ప్రెస్మెట్లో పాల్గొన్న పలువురు వైద్యులు, నిపుణులు తేల్చి చెప్పారు. గుండెపోటు మరణాలపై ICMR, AIIMS అధ్యయనం చేసిన విషయాన్ని వెల్లడించారు. ఆ నివేదికలో గుండెపోటు మరణాలకు కరోనా వ్యాక్సిన్తో ఎలాంటి సంబంధం లేదని తేలినట్లు వెల్లడించారు.
 కాంగ్రెస్ ఎమ్మెల్యేపై టీపీసీసీ చీఫ్ ఫైర్ తెలంగాణలో చంద్రబాబుకు కోవర్టులు ఉన్నారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసినవ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఫైరయ్యారు. పార్టీ నేతలు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. క్రమశిక్షణ విషయంలో రాజీపడేది లేదని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
  బీసీ లకి 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: కవిత TG: బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 17న రైల్ రోకోకు పిలుపునిచ్చినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రైల్ రోకో పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. 42% బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. ఈ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ రాజ్యసభలో లేవనెత్తాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8లోపు ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కోరారు.
 వర్షాకాలంలో పానీపూరీ ఇంత ప్రమాదమా? వర్షాలు కురుస్తున్నాయి. ఈ చల్లటి సమయంలో చాలామందికి వేడివేడి స్ట్రీట్ఫుడ్ తినాలనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో పానీపూరీలాంటి స్ట్రీట్ఫుడ్ తినడమంటే అనారోగ్యాన్ని ఆహ్వానించడమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వర్షాలకు నీరు కలుషితమయ్యే ప్రమాదముంది. బయటి ఆహారంతో టైఫాయిడ్, డయేరియా, ఇన్ఫెక్షన్స్, కడుపునొప్పి, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్ ఎక్కువ. కొన్నిరోజులు బయటి ఆహారం తినొద్దని సూచిస్తున్నారు.
 గబ్బిలం కరిచి వ్యక్తి మృతి గబ్బిలం కరిచి ఓ వ్యక్తి మరణించినట్లు ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్ వైద్య అధికారులు తెలిపారు. కొన్ని నెలల క్రితం గబ్బిలం కరవడంతో అరుదైన లిసా వైరస్(రేబిస్ తరహా) అతనికి సోకిందని పేర్కొన్నారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని వెల్లడించారు. దీనికి సరైన చికిత్స లేదని, ఇలాంటి కేసు అత్యంత అరుదని చెప్పారు. ఈ వైరస్ సోకితే పక్షవాతం, మతిమరుపు, మూర్ఛ రావడంతో పాటు అరుదుగా మరణం సంభవిస్తుంది.
  సోనియా, రాహుల్ విచారణ అనుమతికి ఈడీ పిటిషన్ నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. యంగ్ ఇండియా కంపెనీ పేరిట రూ.2వేల కోట్ల మనీలాండరింగ్ జరిగిందని, ఆ డబ్బు కాజేసేందుకు సోనియా, రాహుల్ ప్రయత్నించారని అభియోగాలు మోపింది. దీంతో సోనియా, రాహుల్ విచారణకు కోర్టు అనుమతి ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.
 US 500% టారిఫ్ హెచ్చరిక.. జైశంకర్ రియాక్షన్ రష్యాతో ఆయిల్ డీల్ పెట్టుకునే భారత్, చైనాలాంటి దేశాలపై 500 శాతం టారిఫ్ విధించేలా బిల్ తెస్తామని రిపబ్లిక్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించిన విషయం తెలిసిందే. నేరుగా భారత్ పేరు ప్రస్తావించడంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. 'ఎనర్జీ, సెక్యూరిటీ విషయంలో మన ఆసక్తులు, అవసరాలు ఆయనకు తెలియజేశాం. సరైన సమయంలో ఆ అవరోధాన్ని అధిగమిస్తాం' అని ఆశాభావం వ్యక్తం చేశారు.
 24 గంటలూ అలర్ట్ ఉండాలి: రంగనాథ్ వర్షాకాలంలో ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ సీవీ రంగనాథ్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందుగానే సన్నద్ధం కావాలన్నారు. ఎమర్జెన్సీ బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షంతో తలెత్తే సమస్యలతో పాటు వాటి పరిష్కారాలపై అవగాహన ఉండాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
 మైక్రోసాఫ్ట్ భారీగా లేఆఫ్లు.. 9 వేల మందికి నోటీసులు! ఉద్యోగం తొలిగింపు రంగం సిద్ధం . టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వేలాది మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేస్తునట్లు ప్రకటించింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ స్థాయి లేఆఫ్లు ప్రకటించడం ఇది రెండోసారి. టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వేలాది మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేస్తునట్లు ప్రకటించింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ స్థాయి లేఆఫ్లు ప్రకటించడం ఇది రెండోసారి. అయితే, ఈసారి ఎంతమందిపై వేటు పడనుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పనప్పటికీ.. దాదాపు నాలుగు శాతం కంటే తక్కువ ఉద్యోగులపై ప్రభావం చూపనుందని తెలిపింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం దాదాపు 9 వేల మందికి లేఆఫ్లు ఇచ్చినట్లు సమాచారంజూన్ 2024 నాటికి 2.28 లక్షల మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులను మొదలుపెట్టిన టెక్ దిగ్గజం.. ఈ ఏడాది మే నెలలో 6 వేల మందికి లేఆఫ్లు ప్రకటించింది. తాజాగా మరోసారి పెద్దఎత్తున తొలగింపునకు సిద్ధమైంది. తాజా నిర్ణ...
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం భాధ్యతలు స్వీకరించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఏసిపి గా సత్యనారాయణ, ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ SHOగా ఇన్స్పెక్టర్ చిట్టిబాబు భాధ్యతలు స్వీకరించారు.అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయం లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారిని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు.

బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయం

 బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసుసురేష్  ఖమ్మం: మా సోదరులు ఎస్సీ, ఎస్టీ . మైనారిటీలను కలుపుకొని గ్రామమే రాజకీయ యూనిట్ చేసి బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో మీడియా మిత్రులతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ కార్యక్రమంలో దాసు సురేష్ పాల్గొని మాట్లాడుతూ... గత 78 సంవత్సరాలుగా బీసీలకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను 18 శాతానికి కుదించి బీసీలకు వ్యతిరేకంగా పయనించడం వల్లనే గద్దెదించడం జరిగిందన్నారు బీసీలు కాంగ్రెస్తో ప్రయాణించడం వల్లనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతున్నా.. ఆ సామాజిక న్యాయం తెలంగాణాలో లేకపోవడం బాధాకరమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానంచేసి నామినేటెడ్ పదవుల్లో మాత్రం సీఎం సామాజిక వర్గానికి వర్తింపజేయటం అన్యాయమన్నారు. స్థానిక సంస్థల లో రిజర్వేషన్లు వ...
 ‘హరిహర వీరమల్లు' ట్రైలర్ వచ్చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ తెరకెక్కించిన 'హరిహర వీరమల్లు' ట్రైలర్ విడుదలైంది. పవన్ లుక్స్, మ్యూజిక్, డైలాగ్స్, ఫైటింగ్ సన్నివేశాలు, VFX ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈనెల 24న HHVM విడుదల కానుంది.
 ప్రధానికి 24 దేశాల అత్యున్నత పురస్కారాలు ఘనా దేశం ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం అందించిన విషయం తెలిసిందే. ఘనాతో కలిపి PM మోదీకి మొత్తం 24 దేశాలు తమ అత్యున్నత పురస్కారాలు అందజేశాయి. ఈ లిస్ట్లో USA, UAE, సౌదీ అరేబియా, కువైట్, రష్యా, ఫ్రాన్స్, ఈజిప్ట్, పాలస్తీనా, అఫ్గానిస్థాన్, మాల్దీవ్స్, భూటాన్, ఫిజి, నైజీరియా, మారిషస్, శ్రీలంక, గయానా, డొమెనికా, బార్బడోస్, సైప్రస్, గ్రీస్, రిపబ్లిక్ ఆఫ్ పాలవ్, పపువా న్యూగినియా, బహ్రెయిన్ ఉన్నాయి.
 1,340 ఉద్యోగాలకు నోటిఫికేషన్ 1,340 జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా/డిగ్రీ పూర్తిచేసిన 30 ఏళ్లలోపు (కొన్నింటికి 32) వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జులై 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి. CBT-1 పరీక్షలు OCT 27-31 మధ్య జరుగుతాయి. CBT-2 పరీక్షలు 2026 జనవరి-ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి రూ.35,400-రూ.1,12,400 వరకు జీతం చెల్లిస్తారు.
 US-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు అమెరికా- భారత్ మధ్య మినీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి. వాషింగ్టన్లో ఇరు దేశాల ప్రతినిధులు ఈ డీల్ప చర్చలు కొనసాగిస్తున్నారు. 48 గంటల్లోగా రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నాయి. భారత్ తక్కువ టారిఫ్కు తమతో డీల్ చేసుకుంటే.. తాము కూడా లెస్ టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
 సీజ్ఫైర్ లేదు.. హమాస్ అంతమే: నెతన్యాహు పాలస్తీనాతో సీజ్ఫైర్ ఉండదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెప్పారు. హమాస్ని కూకటివేళ్లతో పెకలించే వరకు యుద్ధం ఆగదన్నారు. మరోవైపు ఖతర్, ఈజిప్ట్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తూ హమాస్కు సీజ్ఫర్ ప్రతిపాదన పంపగా.. దాన్ని ఆ దేశం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అటు ట్రంప్ కూడా 60 రోజులు సీజ్ఫైర్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ దాడిలో గాజాలో 111 మంది మరణించినట్లు సమాచారం.
 మళ్లీ పెరిగిన బంగారం ధరలు బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹440 పెరిగి ₹99,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹400 పెరిగి ₹91,050 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ. 1,000 పెరిగి రూ.1,21,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నా యి.
 శ్రీశైలం జలాశయంలో 875అడుగులకు చేరిన నీరు శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 66,746 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 875.60 అడుగులు(పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు) కాగా, నీటి నిల్వ 166.3148 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ 63,150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే త్వరలోనే జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
 మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లోకి పాము బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య నిన్న జరిగిన తొలి వన్డే సందర్భంగా గ్రౌండ్లో పెద్ద పాము దర్శనమిచ్చింది. దీంతో మ్యాచ్ను కొద్దిసేపు నిలిపి, దాన్ని బయటికి పంపించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అప్పుడప్పుడూ బంగ్లా ఆటగాళ్లు గెలుపు సంబరాల్లో ‘నాగిని డాన్స్' చేస్తుంటారు. దీంతో వారికి మద్దతుగా పాము గ్రౌండ్లోకి వచ్చినట్టుందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచులో బంగ్లా ఓడిపోయింది.
  ఇవాళ, రేపు కాలేజీల బంద్కు PDSU పిలుపు TG: విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఇవాళ, రేపు డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల బంద్కు PDSU పిలుపునిచ్చింది. రూ.8వేల కోట్ల రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఈ తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపడుతున్నట్లు తెలిపింది. సర్కార్ బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని కోరింది.
  స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం ఏమన్నారంటే? TG: త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోందన్నారు. నిన్న సీఎంను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ MLA జూలకంటి రంగారెడ్డి తదితరులు కలవగా.. వారితో ఎన్నికల గురించి ప్రస్తావించారు. సెప్టెంబర్ 30లోపు రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1,007 స్పెషలిస్ట్ ఆఫీసర్ల(S0) ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ రిలీజ్

  APPLY.. 1,007 దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1,007 స్పెషలిస్ట్ ఆఫీసర్ల(S0) ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, PwBD అభ్యర్థులకు రూ. 175, ఇతర అభ్యర్థులకు రూ.850. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టులో, మెయిన్స్ నవంబర్లో, ఇంటర్వ్యూ డిసెంబర్ లో నిర్వహించనుంది. 
 తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 12-15 గంటల సమయం పడుతోంది. 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 74,510 మంది భక్తులు దర్శించుకోగా 28,050 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు సమకూరింది.
  ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ: ఉత్తమ్ TGలో ఈనెల 14న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక పూర్తి స్థాయిలో రేషన్ కార్డులివ్వడం ఇదే తొలిసారన్నారు. తుంగతుర్తిలో జరిగే సభలో సీఎం రేవంత్, Dy. CM భట్టి విక్రమార్క చేతుల మీదుగా అందజేస్తామన్నారు. ఈ నెల 13 వరకు వెరిఫికేషన్ పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 2.89 కోట్ల మందికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
 ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పాలే గణపతి... ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా దహేగాం మండలం చిన్న రాస్పెల్లి కి చెందిన పాలే గణపతి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సుప్రీమ్ కోర్టు న్యాయవాది బీసీ ఉద్యమ నాయకులు డాక్టర్ఈడ శేషగిరి రావు హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నేడు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జిల్లా అధ్యక్షులకు తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో అధ్యక్ష పదవిని అప్పగించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

"సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయలేదు..... దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి పెటాయి.....

  https://youtube.com/shorts/9XHT0d8VTcI?si=IoBMOIiza0njAQrj
  అరవింద్  అరే.. నరేశ్ ఏ వస్తువు కొనాలన్నా మా ఆవిడ రెండు కారణాలు చూపిస్తుందిరా! నరేశ్:ఏమిటవి? అరవింద్: ఒకటి.. పక్కింటివాళ్ల దగ్గర ఉన్నాయి కాబట్టి మనం కొనాలి. రెండోది.. వాళ్ల దగ్గర లేవు కనుక మనం కొంటే గొప్పగా ఉంటుంది.

Latest Headlines

  TODAY HEADLINES TG: సిగాచీ ఫ్యాక్టరీ ప్రమాదంలో 40 మంది మృతి.. రూ.కోటి చొప్పున పరిహారం మేడారం మహాజాతర తేదీల ప్రకటన 1.ప్రతి విద్యార్థి ఇంటర్ పూర్తిచేసేలా చూడాలి: CM రేవంత్ 2.నేను BRSలోనే ఉన్నా: MLC కవిత 3.ఏపీలో రేపు ప్రైవేట్ స్కూళ్లు బంద్: యాజమాన్యాల అసోసియేషన్ '4.కుప్పం'పై సీఎం చంద్రబాబు వరాల జల్లు 5.జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల 6.ENGతో రెండో టెస్టులో గిల్ సెంచరీ

నెం.1 తెలుగు న్యూస్ బ్లాగ్ "' తెలంగాణ టెక్నికల్ బ్లాగ్" '

  నెం.1 తెలుగు న్యూస్ బ్లాగ్ "' తెలంగాణ టెక్నికల్ బ్లాగ్" '  సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతలు సహా లక్షలాది మంది తెలుగు ప్రజలు ప్రతిరోజూ వాడుతున్న నెం.1 న్యూస్ బ్లాగ్ఇది. ప్రతి నిమిషం సంక్షిప్త వార్తలతో మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా అప్డేడేటెడ్గా ఉండవచ్చు. 2 వేలకు పైగా రిపోర్టర్ల నెట్వర్కుతో మీ గ్రామ, మీ మండల, జిల్లా వార్తలు అందిస్తున్న ఏకైక తెలుగు బ్లాగ్ ఇది. 
 ⚪ *హైదరాబాద్*  ◽ *ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షులును ప్రకటించిన  పార్ట్  అద్యక్షుడు డా .ఈడా శేషగిరిరావు గౌడ్ గారు*   1.*పెద్దపల్లి - గంగుల రాజేంద్ర ప్రసాద్*  (మున్నూరు కాపు) 2.*కొమరం భీమ్ ఆసిఫాబాద్ - పాలే గణపతి*  (అరె - బీసీ)
  *⚠️ సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసాలపై జిల్లా పోలీసుల హెచ్చరిక* ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త రకమైన మోసానికి పాల్పడతున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్ల వైద్య పరీక్షల పేరిట డయాగ్నొస్టిక్ సెంటర్లను టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఈ మోసపు తంతు ప్రకారం, Mahabubnagar జిల్లాలో BSF జవాన్ల క్యాంప్ ఉందని నమ్మకంగా చెప్పుతూ, మా వద్ద 27 మంది జవాన్లు మెడికల్ చెకప్ చేయించుకోవాల్సి ఉందని, ఒక్కొక్కరికీ ₹3500 చొప్పున మొత్తం ఖర్చు అయ్యే వ్యయానికి మా ఆఫీస్ నుండి మీకు చెల్లిస్తామని, అందుకు గాను మీరు మాకు 50% నగదు అంటే ₹47,250 తక్షణం చెల్లిస్తే, రేపు టెస్టులు అయ్యాక మేము మీకు 50%+100% బిల్లు మొత్తం 1,41,750/- నగదును చెల్లిస్తామని హామీ ఇస్తున్నారు. ఇందులో అత్యంత దారుణం ఏమిటంటే, జిల్లా పోలీసు అధికారుల పేర్లను కూడా వాడుకుంటూ నమ్మకంగా చూపుతున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని ఒక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని మోసం చేయడానికి యత్నించారు. *📢 ప్రజలకు, డయాగ్నొస్టిక్ సెంటర్లకు విజ్ఞప్తి:* ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా సైబ...