బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలి
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసుసురేష్
ఖమ్మం: మా సోదరులు ఎస్సీ, ఎస్టీ . మైనారిటీలను కలుపుకొని గ్రామమే రాజకీయ యూనిట్ చేసి బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో మీడియా మిత్రులతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ కార్యక్రమంలో దాసు సురేష్ పాల్గొని మాట్లాడుతూ... గత 78 సంవత్సరాలుగా బీసీలకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను 18 శాతానికి కుదించి బీసీలకు వ్యతిరేకంగా పయనించడం వల్లనే గద్దెదించడం జరిగిందన్నారు బీసీలు కాంగ్రెస్తో ప్రయాణించడం వల్లనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతున్నా.. ఆ సామాజిక న్యాయం తెలంగాణాలో లేకపోవడం బాధాకరమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానంచేసి నామినేటెడ్ పదవుల్లో మాత్రం సీఎం సామాజిక వర్గానికి వర్తింపజేయటం అన్యాయమన్నారు. స్థానిక సంస్థల లో రిజర్వేషన్లు వస్తాయనుకుంటే దానిని తాత్సారం చేస్తున్నారన్నారు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వలేక పోయిందన్నారు. అసెంబ్లీలో పాసైన అయిన 42 శాతం బిసి రిజర్వేషన్ ఆమోద బిల్లును గవర్నర్ కు పంపారు కానీ రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాలని ప్రశ్నించారు. 1992లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తో సంప్రదించి 92వ రాజ్యాంగ సవరణ చేసి 69శాతం రిజర్వేషన్లను పెంచి అమలు చేయించుకున్నారని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మాని బీసీ రేజర్వేషన్ల పెంపుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్ నందు 4 నియోజకవర్గాలకు గాను కనీసం ఒక స్థానం కూడా బీసీలకు దక్కకపోవడం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను కనీసం ఒక్క స్థానము కూడా బీసీలకు దక్కక పోవడం బీసీలపై కొనసాగుతున్న తీవ్ర వివక్షకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. గ్రామస్థాయిలో బీసీలు ఐక్యమైతే రాజ్యాధికారం నల్లేరుపై నడకే నని సురేష్ తెలిపారు జిల్లా బీసీ ముఖ్య నాయకుల సమక్షంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని తద్వారా ప్రతి గ్రామాన్ని ఒక రాజకీయ యూనిట్ గా ఏర్పాటు చేసుకొని పూర్తిస్థాయి కమిటీలను మండల, నియోజకవర్గ జిల్లా వ్యాప్తంగా బీసీ ఐక్య వేదికలు ఏర్పాటుచేసి రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పెళ్లూరి విజయ్ కుమార్ ఉరుకొండ సైదులు, పీట్ల స్వర్ణ కుమార్. నక్క అజయ్ , అయితగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment